Sai Pallavi: సాయిపల్లవిపై విషం కక్కుతున్న బాలీవుడ్ మీడియా.. కారణాలివే!

  • April 29, 2024 / 03:55 PM IST

స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి (Sai Pallavi) టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు సౌత్ ఇండియా అంతటా క్రేజ్ ఉంది. సాయిపల్లవి బాలీవుడ్ రామాయణంలో నటిస్తుండగా సీత లుక్ లో సాయిపల్లవి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లీకైన ఫోటోలను చూసి సాయిపల్లవి ఫ్యాన్స్ మురిసిపోవడంతో పాటు సీత పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్ మీడియా, బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం సాయిపల్లవి లుక్స్ విషయంలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఆదిపురుష్ (Adipurush) సినిమా రిలీజ్ సమయంలో కృతిసనన్ పై (Kriti Sanon) తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలను దృష్టిలో ఉంచుకుని సాయిపల్లవిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయిపల్లవిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. సాయిపల్లవి యాక్టింగ్ విషయంలో టాప్ అని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తండేల్ (Thandel) సినిమా బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసింది. తెలుగులో క్రేజీ సినిమాలపై నెట్ ఫ్లిక్స్ ప్రధానంగా దృష్టి పెడుతోంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఇండియాలో రీచ్ మరింత పెరిగేలా నెట్ ఫ్లిక్స్ వ్యూహాలు ఉన్నాయి. తండేల్ మూవీ 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తండేల్ మూవీ డిసెంబర్ నెలలో విదుదల కానుందని సమాచారం అందుతోంది. తండేల్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండబోతున్నాయని భోగట్టా.

సాయిపల్లవి రెమ్యునరేషన్ ను పెంచారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. సాయిపల్లవి పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సాయిపల్లవి పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus