వినయ విధేయ రామ పబ్లిసిటీ విషయంలో టెన్షన్ పడుతున్న బోయపాటి

  • December 11, 2018 / 02:18 PM IST

నిన్నమొన్నటివరకూ బోయపాటి “వినయ విధేయ రామ” సినిమా కోసం పెడుతున్న ఖర్చును చూసి నిర్మాత దానయ్య భయపడితే.. ఇప్పుడు ఆయన్ని చూసి బోయపాటి భయపడుతున్నాడట. అందుకు కారణం మరేదో కాదు.. సినిమా విడుదలకు ఇంకా సరిగ్గా నెల రోజులు కూడా లేకపోవడం.. ఇప్పటివరకూ దానయ్య ప్రమోషన్స్ మొదలెట్టకపోవడమే అందుకు కారణం. ఈ విషయమై ఆల్రెడీ దానయ్యతో బోయపాటి ఒకటికి రెండు సార్లు చర్చించినా పెద్దగా లాభం లేకపోయింది. బోయపాటి కూడా సినిమాని తొందరగా కంప్లీట్ చేయాలన్న ప్రెజర్ తో ఉండడంతో ఈ విషయాల్ని పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పుడేమో రిలీజ్ దగ్గర పడుతుండడం, మరోవైపు బాలకృష్ణ “ఎన్టీఆర్ కథానాయకుడు” లాంటి భారీ చిత్రం సరిగ్గా రెండు రోజుల ముందు విడుదలవుతుండడంతో బోయపాటి కాస్త భయపడుతున్నాడు. ఈ రెండు సినిమాల జోనర్స్ వేరు అయినప్పటికీ.. జనాల దృష్టి మాత్రం ఎక్కువగా “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమా పైనే ఉంది. ఇప్పుడు ఆ దృష్టిని తమవైపు మరల్చుకోవాలంటే కనీసం ఇప్పటినుంచైనా ప్రమోషన్స్ మొదలెట్టాలి. మరి ఈ విషయాన్ని దానయ్య ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటాడా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus