పేటా’ నిర్మాతల పై ఫైరయిన.. అల్లు కాంపౌండ్…!

  • January 7, 2019 / 01:43 PM IST

తాజాగా జరిగిన రజినీకాంత్ ‘పేటా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాతలు ప్రసన్న, అశోక్ వల్లభనేనిలు టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాతల పై వివాదాస్పద కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ‘గీతా అర్స్’ అధినేత అల్లు అరవింద్, ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ అధినేత దిల్ రాజు చిన్న సినిమాలని బ్రతకనివ్వట్లేదని.. అలాగే వారు పుడుతూనే థియేటర్లతో పుట్టారా… ? వీళ్ళు కుక్కలంటూ వివాదాలకు తెరలేపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పై ‘జి.ఏ 2 పిక్చర్స్ ‘ అధినేత… నిర్మాత బన్నీ వాస్ తీవ్రంగా స్పందించారు.

బన్నీ వాస్ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ‘పేటా’ నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ”ప్రసన్న గారు,తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ణానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పొయే పరిస్థితి కి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది” అంటూ తన పేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టాడు. జనవరి 9 న ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’, జనవరి 11 న ‘వినయ విధేయ రామా’, జనవరి 12 న ‘ఎఫ్2’ వంటి చిత్రలోతోనే దాదాపు 80 శాతం థియేటర్లు ఫిల్ అయిపోతాయి. అలాంటి సమయంలో ఒక డబ్బింగ్ సినిమాకి అన్ని థియేటర్లు ఎలా ఇస్తారు… అదే తమిళంలో మన తెలుగు చిత్రాలు ఇదే పరిస్థితిలో ఉంటే వారు కనీసం పట్టించుకొరు.. అంటూ కొందరు సోషల్ మీడియాలో అల్లు అరవింద్, దిల్ రాజు లకు మద్దతు పలుకుతున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus