“భరత్ అనే నేను” చిత్ర బృందంపై కేసు!

  • June 5, 2018 / 06:11 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20 తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్  రాబట్టి 200 కోట్ల మెయిలు రాయిని క్రాస్ చేసింది. ఇంతటి విజయం సాధించిన ఈ సినిమా మరోసారి వివాదాల్లోకెక్కింది. ఇప్పటికే ఒక రచయిత “భరత్ అనే నేను” చిత్ర కథ నాదే అంటూ రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక వివాదం ఈ చిత్రాన్ని చుట్టుముట్టింది.

నవోదయం పార్టీ వారి నుంచి ఎటువంటి పరిమిషన్ లేకుండా పేరును వాడుకున్నందుకు వారు మండిపడుతున్నారు. అంతేకాదు నవోదయం పార్టీ నాయకుడు హత్య చేసినట్టుగా చూపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నవోదయం పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు  గుంటూరు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు  చేశారు. ఎన్నికల కమిషన్ 2012 లో ఈ పార్టీ కి గుర్తింపును ఇచ్చింది. అలాగే ఈ పార్టీ గత ఎన్నికల్లో చీరాల నియోజక వర్గం నుంచి పోటీ చేసింది. మరి వీరి డిమాండ్ కి డీవీవీ దానయ్య, కొరటాల శివ, మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus