సాహో షూటింగ్ ప్రదేశానికి మొబైల్ తీసుకురావద్దని చెప్పిన సుజీత్!

  • November 4, 2017 / 06:36 AM IST

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో షూటింగ్ కొన్ని రోజుల క్రితం వరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరిగింది. ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ తిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. అలాగే అమీర్ పేటలో వేసిన ఇంటి సెట్ లోను హీరోయిన్ శ్రద్ధ కపూర్, ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో చిత్ర బృందం దుబాయ్ వెళ్లనుంది. అక్కడే కీలకమైన యాక్షన్ సీన్స్ షూట్ చేయనుంది. ఈ చిత్రీకరణ దృశ్యాలు ఎక్కడ లీక్ అవుతాయోనని సుజీత్ ఆందోళన పడ్డారు. అందుకే చిత్ర బృందానికి ఓ ఆర్డర్ పాస్ చేశారు.

షూటింగ్ స్పాట్ కి ఎవరూ మొబైల్స్ తీసుకురావద్దని చెప్పారు. డైరక్టర్ మాటకు ప్రభాస్ తో పాటు అందరూ ఓకే చెప్పారు. అబుదాబిలో జరిగే ఈ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. ఆకాశంలో జరిగే ఈ ఫైట్ సినిమాలో హైలెట్ కానుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus