సెన్సార్ విషయంలో టెన్షన్ పడుతున్న క్రిష్ 

  • January 2, 2019 / 01:51 PM IST

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజులు ఉంది. అలాంటి సమయంలో ఈ సెన్సార్ గోల ఏంటి అనుకుంటున్నారా. ఇక్కడ సమస్య వచ్చింది మొదటి భాగంగా విడుదలవుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాకి కాదు.. మలిభాగంగా ఫిబ్రవరిలో వస్తున్న “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమాకి. సినిమా ఎడిట్ టేబుల్ దగ్గర పెద్ద సమస్య వచ్చిపడిందట. దాంతో వచ్చే నెల విడుదలవ్వాల్సిన ఈ సినిమా అవుట్ పుట్ ఫైనల్ కట్ ఇప్పటివరకూ కుదరలేదంట. ముఖ్యంగా.. సెకండ్ పార్ట్ మొత్తం ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించే ఉంటుంది. దాంతో చాలామంది వెళ్ళు పెడుతున్నారు. ఆ కారణంగా క్రిష్ మరియు బాలకృష్ణ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు

.
దాంతో ఫస్ట్ పార్ట్ విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ బట్టి సెకండ్ పార్ట్ ను ఎడిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడట క్రిష్. ఈలోపు ఫస్ట్ పార్ట్ చూసినవాళ్ళలో ఎవరో ఒకరు ఇంకాస్త ఎక్కువ ఇన్ఫో ఇస్తారుగా దాన్నిబట్టి ఫైనల్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు టీం అందరూ. జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” కోసం మాత్రం నందమూరి ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి క్రిష్ వారి అంచనాలను అందుకోగలుగుతాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus