‘లస్ట్ స్టోరీస్’ విషయంలో పెద్ద షాక్ ఇచ్చిన ఈషా రెబ్బా..!

  • November 19, 2019 / 06:04 PM IST

హిందీలో రూపొంది మంచి ప్రేక్షకాదరణ పొందిన బోల్డ్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈషారెబ్బా కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ మొదలు పెట్టడమే కాకుండా ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ చేశారట. ఈ రెండు ఎపిసోడ్స్ ను ‘ఘాజి’ ‘అంతరిక్షం’ చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసాడట. ఈ ఎపిసోడ్స్ లో హీరోయిన్ ఈషా రెబ్బా తో పాటు హీరో సత్య దేవ్ , అవసరాల శ్రీనివాస్ కూడా నటించారని తెలుస్తుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ లో ఈషారెబ్బా పాత్ర గురించి మాట్లాడుతూ… ” ‘లస్ట్ స్టోరీస్’ కథలు వేరు – తెలుగులో పూర్తిగా మార్చేశారు. వాటినే మళ్ళీ ఎందుకు తీస్తారు. ఇక కీయరా రోల్ నేను చేస్తున్నట్లు అందరూ అడుగుతున్నారు… కానీ అదేమీ లేదు. నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. తాజాగా రెండు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. 2020 మార్చి లో వాటిని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక మిగతా ఎపిసోడ్స్ ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం నాకు కూడా తెలీదు. ఆ విషయంలో నేను కూడా ఎగ్జైటింగ్ గానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus