కాటమ రాయుడు చిత్రం టెక్నీషియన్లలో కొనసాగుతున్న మార్పులు!

  • September 23, 2016 / 01:26 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమ రాయుడు షూటింగ్ రైట్ ట్రాక్ లో పడింది. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ లో మొదలైన చిత్రీకరణలో రేపటి నుంచి పవన్ పాల్గొననున్నారు. అయితే ఇంకా ఈ మూవీ టెక్నీషియన్లలో మార్పులు కొనసాగుతున్నాయి. త‌మిళంలో అజిత్ హీరోగా వ‌చ్చిన “వీర‌మ్” సినిమా తెలుగు రీమేక్ కి మొదట తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య ని అనుకున్నారు. అయన ప్రీ ప్రొడక్షన్ దశలో పూర్తిగా ఉన్నారు. షూటింగ్ సమయం వచ్చేసరికి విలన్ గా మురుగదాస్ సినిమాలో ఆఫర్ రావడంతో ఈ సినిమాను వదిలేశారు.

ఆ స్థానంలో గోపాల గోపాల డైరక్టర్ డాలీ వచ్చారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ విషయంలో మార్పు జరిగింది. మొదట కాటమ రాయుడు కోసం బెంగాల్ టైర్ సినిమాకు పనిచేసిన సౌందర్య రాజన్ ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ప్రసాద్ మూరెళ్ల చేరారు. గతంలో ఈయన అత్తారింటికి దారేది సినిమాకు పని చేశారు. ఈ మార్పు వెనుక షూటింగ్ ఆలస్యం కారణమని సౌందర్య రాజన్ వైపు వారు చెబుతుంటే.. రాజన్ కి డాలీకి సూట్ కావడం లేదని దర్శకత్వం శాఖలోని వారు వివరిస్తున్నారు.

ఏది ఏమైనా అత్తారింటికి దారేది కాంబినేషన్ మళ్లీ సెట్ అయింది.. మార్పు మంచిదేనని పవన్ సన్నిహితులు సంతోషపడుతున్నారు. ఈ చిత్రం కూడా అంత హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నారు. అతనికి జోడీగా శృతిహాసన్, యామిని భాస్కర్ నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus