లాక్ డౌన్ సమయంలో మహేష్ దేశముదురు ప్లాన్స్

  • July 5, 2020 / 11:23 AM IST

టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బ్రాండ్ వాల్యూ ఏమిటో అందరికీ తెలుసు. ఏ స్టార్ హీరో చేయనన్ని ఉత్పత్తులకు ప్రచార కర్తగా మహేష్ ఉన్నారు. ఇక డబ్బులు వచ్చే ఏ ఆదాయ మార్గాన్ని మహేష్ వదిలిపెట్టడు. ఈ మధ్య తను నటించే ప్రతి సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఆయన ఉంటున్నారు. థియేటర్స్ బిజినెస్ తో పాటు, ది హుంబుల్ కో బ్రాండ్ నేమ్ తో బట్ట వ్యాపారం కూడా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా నెలలుగా ఇంటిలోనే ఉంటున్న మహేష్ ఈ ఖాళీ సమయంలో కొత్త బిజినెస్ ఆలోచనలు చేస్తున్నాడట.

తన భార్య నమ్రతతో కలిసి మహేష్ కొత్త వ్యాపారానికి సంబంధించిన ఐడియాలు డెవలప్ చేస్తున్నారట. ముఖ్యంగా ఏదైనా ట్రెండీ బిజినెస్ స్టార్ట్ చేయాలనేది వారి ఆలోచనట. జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న ఓ టి టి ప్లాట్ ఫార్మ్ స్థాపించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్ మొత్తం డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ దే అని అర్థం అవుతుండగా ఓ కొత్త ఓ టి టి యాప్ డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారట.

లాక్ డౌన్ అనంతరం దీనిపై పూర్తిగా ద్రుష్టి కేంద్రీకరించనున్నారని సమాచారం. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్న సర్కారు వారి పాట షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుపెట్టాలని అనుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరింత సమయం పెట్టేలా ఉంది.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus