మరోమారు తన ధాతృత్వాన్ని ఘనంగా చాటుకొన్న చిరంజీవి

  • April 4, 2018 / 02:12 PM IST

ఒక ఎజెండా లేకుండా రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల కొందరికి చీప్ అయ్యాడేమో కానీ వ్యక్తిగా, నటుడిగా మెగాస్టార్ పై వేలెత్తి చూపే మొనగాడు ఇప్పటివరకు పుట్టలేదు. ‘ఖైదీ నెం.150’ సినిమాతో కథానాయకుడిగా తన స్టామినా ఇసుమంతైనా తగ్గలేదని పదేళ్ళ తర్వాత కూడా ఘనంగా ప్రూవ్ చేసుకొన్న మెగాస్టార్ చిరంజీవి.. అదే సమయంలో తన ధాతృత్వాన్ని కూడా వెస్ట్ గోదావరిలో పేరుపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ఘనంగా చాటుకొన్నారు. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలోని సంపర గ్రామాన్ని ఆయన దత్తత తీసుకొన్నారు.

ఆల్రెడీ 3 కోట్ల రూపాయలు చెక్ కూడా ఇచ్చారు. వెంటనే డెవలప్ మెంట్ వర్క్స్ మొదలెట్టమని రిక్వెస్ట్ చేశారు చిరంజీవి. ఇకపోతే.. చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రమైన “సైరా నరసింహా రెడ్డి” సెకండ్ షెడ్యూల్ మొదలైంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus