స్టెప్పులతో సునామీ సృష్టించిన చిరు

  • June 13, 2016 / 07:52 AM IST

రాజకీయాల్లోకి వెళ్లారు.. డాన్స్ చేయడం మరిచారు .. అనుకున్నారా? అదేం లేదు.. సేమ్ ఎనర్జీ.. సేమ్ స్టైల్. స్టేజీ మీద స్టెప్పులతో మెగాస్టార్ చిరంజీవి సునామీ సృష్టించారు. ఆదివారం రాత్రి హైటెక్ సిటీ లోని హెచ్ఐసిసిలో జరిగిన మా టీవీ అవార్డ్స్ కార్యక్రమంలో డాన్స్ వేసి అదరగొట్టారు. “మా టీవీ” వారు ప్రతి ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో బెస్ట్ గా నిలిచిన వాటికి అవార్డులు ఇస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అవార్డులు ప్రదానం చేసారు. స్టార్ కంపనీ “మా టీవీ”ని సొంతం చేసుకున్నతర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకలో నేటి తెలుగు హీరోయిన్ లతో పాటు మెగాస్టార్ చిరంజీవి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

20 నిమిషాల పాటు సాగిన చిరు ప్రదర్శనలో గ్యాంగ్ లీడర్ సాంగ్ ఉర్రూతలూగించింది. హీరోలు శ్రీకాంత్, నవదీప్, సాయి ధరమ్ తేజ్, సునీల్ మెగాస్టార్ తో కలిసి స్టెప్పు లేసారు. హాల్ మొత్తం విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. అభిమానులందరూ బిగ్ బాస్ కి చప్పట్లతో సినిమాల్లోకి పునః స్వాగతం పలికారు. ఈ పాటతో పాటు ముఠామేస్త్రి, ఘరానా మొగుడు, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ లోని పాటలకు చిరంజీవి హుషారుగా డ్యాన్స్ చేసారు. చిరు 150వ సినిమా కత్తిలాంటోడు సెట్స్ మీదకు వెళ్లేముందు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా పై ఇప్పటి నుంచే అంచనాలను పెంచారు. ఈ కార్యక్రమం త్వరలో “మా టీవీ” లో ప్రసారం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus