అనసూయను చేరుకోలేకపోయిన చిరంజీవి

చలన చిత్ర రంగంలో బాక్స్ లు బద్దలు కొట్టే మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరలో వెనుకబడి పోయారు. భారీ  అంచనాలతో “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన చిరుకి చేదు అనుభవం ఎదురైంది. యాంకర్ అనసూయను కూడా మించలేక పోయారు. టెలివిజన్ లో షో కి వచ్చిన టీఆర్పీ బట్టి ఆ కార్యక్రమం సక్సస్ ఆధారపడి ఉంటుంది. మాటీలో ప్రసారమవుతున్న గేమ్ షో ఎంఈకె కి గత వారం 5.80 రేటింగ్ వచ్చింది. జెమినిలో అనసూయ యాంకరింగ్ చేస్తున్న కొత్త షో జాక్ పాట్ కి గతవారం 6.5 రేటింగ్ వచ్చింది. సినీ సెలబ్రిటీలతో చిరు చేస్తున్న షో కంటే.. టీవీ సెలబ్రిటీలతో అనసూయ చేసిన షో ని ఎక్కువమంది వీక్షించారు.

దీంతో ఎంఈకె బృందం ఆలోచనలో పడింది. చిరు షో రేటింగ్ పెంచడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. బుల్లితెరలో చిరు ఇప్పుడే అడుగుపెట్టారు.. రాను రాను రేటింగ్ పెంచుకుంటారు అని చిరు అభిమానులు ఓటమిని కవర్ చేసుకుంటున్నారు. మూడో సీజన్ కే ఆదరణ కోల్పోయిన  “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో కు హోస్ట్ గా ఒప్పుకోవడం చిరంజీవి చేసిన తప్పని టీవీ రంగ నిపుణులు చెబుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus