చిరంజీవి తర్వాతి సినిమాకి పనిచేయనున్న బాహుబలి బృందం

  • January 31, 2017 / 10:28 AM IST

‘నన్ను ఇప్పుడు ఆదరిస్తారా?’.. అనే ప్రశ్న మెగాస్టార్ చిరంజీవిని ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చేశాయి. తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడాన్ని, తొలి చిత్రంలా భావించి ఆయన కష్టపడ్డారు. ప్రయోగాల జోలికి పోకుండా హిట్ అయిన కథతో ఖైదీ నంబర్ 150 అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ఒక వారంలో వంద కోట్ల గ్రాస్, రెండో వారానికి వంద కోట్ల షేర్ ని వసూల్ చేసి మెగా స్టార్ సత్తాన్ని చాటింది. ఖైదీ ఇచ్చిన ఉత్సాహంతో 151 మూవీని తెరకెక్కించడానికి సిద్ధమయిపోయారు. ఇప్పుడు ప్రయోగానికి దిగారు. 1840 లో అందరితో జేజేలు అందుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని కథగా తీసుకున్నారు. దీనికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ రెడీ చేస్తుండగా.. నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ కథను అద్భుతంగా ఆవిష్కరించడానికి ఆర్ట్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులను సంప్రదిస్తున్నారు.

చెర్రీ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర కు గ్రాఫిక్స్ హంగులు అందించిన కనల్ కణ్ణన్ తో చర్చలు  జరపడం, ఆయన ఓకే అనడం జరిగిపోయాయి. ప్రస్తుతం కనల్ బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. బాహుబలి పని పూర్తవ్వగానే ఆ టీమ్ మొత్తం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు పనిచేయనున్నట్లు సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus