Chiranjeevi, Pawan Kalyan: మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందా.. లేదా?

  • August 19, 2021 / 10:10 PM IST

రాబోయే సంక్రాంతి పండుగకి టాలీవుడ్ లో పలు బడా సినిమాలు సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయగా మరొక రెండు మూవీస్ త్వరలో రిలీజ్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయం లోకి వెళితే ముందుగా జనవరి 12న సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ నటుడు దగ్గుబాటి రానాల కలయికలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ విడుదల కానుందని ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా జనవరి 26కి వాయిదా పడగా, దాని స్థానంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో కొరటాల శివ తీస్తున్న ఆచార్య సినిమా విడుదల కానుందని టాక్. మెగాస్టార్ బర్త్ డే రోజున దీనికి సంబంధించి ఆచార్య యూనిట్ ప్రకటన వెలువరించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం ఆచార్య మూవీ షూట్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుండగా, అదే ప్లేస్ లో భీమ్లా నాయక్ షూట్ కూడా జరుగుతోంది.

అయితే రెండు షూటింగ్స్ విరామ సమయంలో ఆచార్య మూవీలో ఖైదీ లుక్ లో ఉన్న మెగాస్టార్ ని భీమ్లా లో పోలీస్ గెటప్ లో ఉన్న పవర్ స్టార్ ప్రత్యేకంగా కలిశారట. ఆ సందర్భంగా వీరిద్దరి మధ్య తమ సినిమాల రిలీజ్ విషయం చర్చకు వచ్చిందని, ఆ తరువాత ఆచార్య టీమ్ వారు భీమ్లా నాయక్ టీమ్ తో మాట్లాడి తమ సినిమా విడుదల విషయమై రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా రాబోయే పొంగల్ బాక్సాఫీస్ రేస్ నుండి పవర్ పవర్ స్టార్ భీమ్లా నాయక్ తప్పుకోగా మెగాస్టార్ ఆచార్య వచ్చి చేరినట్లు చెప్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus