రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

  • August 29, 2019 / 04:34 PM IST

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారా? ఈ అంశం పై చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది నిజమైతే బాగుణ్ణు అని అభిమానులు కోరుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం సమస్యే లేదని ఆ వార్తల్ని కొట్టి పారేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం… పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 2021 వరకూ వరుసగా రెండు సినిమాలు చేయబోతున్నారట పవన్ కళ్యాణ్.

అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానప్పటికీ … ఫిలింనగర్లో మాత్రం ఈ విషయం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘సైరా’ విషయమై తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ‘సినిమా కెరీర్‌ను వేస్ట్ చేసుకోవద్దు’ అంటూ తమ్ముడికి సున్నితంగా సలహాలు ఇచ్చారంట. ఇక ‘అభిమానుల గురించి కూడా ఓ సారి ఆలోచించాలని… వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదని’ కూడా చిరు చెప్పడంతో… సినిమాల వైపు రావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది నవంబర్లో పవన్ కళ్యాణ్ సినిమా మొదలు కాబోతుందని…. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించబోతుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 55 కోట్లు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరో విశేషం ఏమిటంటే… ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పని చేస్తారని, అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం పూర్తి కాగానే పవన్ కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్లూరి బేనర్ అయిన ‘ఎస్ఆర్‌టి ఎంటర్టెన్మెంట్స్’ లో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తాడని కూడా తెలుస్తుంది.ఈ చిత్రానికి డాలీ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులలో ఒక్కో సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ రెడీగా ఉందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus