ఆడియన్స్ కి హింట్ ఇవ్వడం కోసమే పెద్దాయన అలా చేశారా

  • March 19, 2018 / 06:35 AM IST

నిన్న జరిగిన ‘రంగస్థలం’ ఆడియో విడుదల వేడుకలో సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పొగడ్తలలో భాగంగా సినిమాలోని ఒక కీలకమైన ట్విస్ట్ ను రివీల్ చేసేశారు. ఆది పినిశెట్టి నటన గురించి మాట్లాడుతున్న సందర్భంలో చిరంజీవి పూసుక్కున “ఆ మర్డర్ సీన్ లో ఆది అద్భుతంగా నటించాడు” అనేశారు. దాంతో ఆది పాత్ర చనిపోతుందని జనాలకి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి అన్నయ్య పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే.. నిన్న విడుదలైన ట్రైలర్ లో ఆదిది నెగిటివ్ రోల్ అన్న విషయం క్లారిటీ వచ్చింది. ఇక చిరంజీవి రివీల్ చేసిన ట్విస్ట్ తో సినిమాలో కీలకాంశం అదేనని అర్ధమైంది.

అయితే.. సినిమాలో ఇంత కీలకమైన విషయాన్ని చిరంజీవి చెప్పేయడం వెనుక ఆంతర్యం ఏమిటో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. సినిమాల్లో అంతటి సీనియర్ అయిన చిరు నోరు జారి మాత్రం అలాంటి కీలెకమైన ట్విస్టులు రివీల్ చేయడు. సో, ఆడియన్స్ ను ముందుగా ప్రిపేర్ చేయడం కోసమే ఇలా చెప్పి ఉంటాడా అని అందరూ అనుకొంటున్నారు. సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి ప్రిపరేషన్స్ ఎందుకు అనే అనుమానాలు కూడా రేకెత్తాయి. ఏదేమైనా మార్చి 30న సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఇలాంటి డౌట్స్ తప్పవు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus