అల్లు అర్జున్ ప్లాప్ డైరెక్టర్ కు షాకిచ్చిన చిరు!

  • May 10, 2019 / 05:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151 వ చిత్రమైన ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ లో చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక మెగాస్టార్ తన తరువాతి చిత్రాల్ని కొరటాల శివ, త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్నాడు. అయితే అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వక్కంతం వంశీ చిరుని కలిసి ఓ కథ వినిపించాడట. ‘కిక్’ ‘రేసు గుర్రం’ ‘టెంపర్’ వంటి చిత్రాలకి రైటర్ గా కూడా పనిచేసాడు వక్కంతం వంశీ.

తాజాగా చిరంజీవి కోసం వంశీ ఓ కథను సిద్ధం చేసాడట. ఇటీవల చిరంజీవిని కలసి కథ వినిపించాడట. అయితే ఆ కథ ఆ మాత్రం చిరుకి నచ్చలేదంట. దీంతో చిరు వంశీకి నో చెప్పేశాడట. లైన్ నచ్చినప్పటికీ చిరు రిజెక్ట్ చేసాడట. దీనికి వంశీ గత చిత్రం ప్లాపవ్వడమే కారణమని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఓ చిన్న హీరోతోనే, మీడియం రేంజ్ హీరోతోనో సినిమా చేసి హిట్టు కొట్టి ప్రూవ్ చేసుకోవాలని… ఆ తరువాతే ఇలాంటి స్టార్ హీరో దగ్గరకి రావాలని ఫిలింనగర్ లో చర్చలు మొదలయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus