మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ గా చిరంజీవి

  • September 8, 2016 / 06:55 AM IST

సామాన్యుల సింహాసనం “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో ఎంతోమంది కలల్ని నిజం చేసింది. హిందీలో కౌన్ బనేగా కరోడ్పతి షో స్పూర్తితో రూపొందించిన ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మూడు సీజన్లలో అలరించింది. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి తనదైన శైలిలో బుల్లి తెర పైన కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. నాలుగో సీజన్ ఎప్పుడు మొదలవుతోందా ? అని ఎదురు చూస్తున్న మాటీవీ ప్రేక్షకులకు ఎంఈకే బృందం మంచి శుభవార్తను మోసుకొచ్చింది.

ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి మొదలయ్యే సీజన్లో హోస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం చిరు తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అంటే సిల్వర్ స్క్రీన్ కంటే ముందే మెగాస్టార్ ని స్మాల్ స్క్రీన్ పై చూడనున్నామన్న మాట. బుల్లి తెర మెగా ఎంట్రీ గురించి తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ షో తో చిరంజీవి టీఆర్పీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus