Chiranjeevi: ఆ సమస్యలను చిరు పరిష్కరిస్తారా?

  • September 17, 2021 / 07:17 PM IST

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా త్వరలో రిలీజ్ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. అయితే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల సినిమాలను రిలీజ్ చేయాలంటే హీరోలతో పాటు దర్శకనిర్మాతలు సైతం టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు సినిమాలకు ఏపీ నుంచే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన సినీ ప్రముఖులకు చిరంజీవిని కలిసే అవకాశం దక్కింది.

చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సమావేశానికి వెళ్లనున్నారని సమాచారం. చిరంజీవి కరోనా వల్ల, జగన్ సర్కార్ అమలులోకి తెచ్చిన జీవో వల్ల ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధానంగా వివరించి సమస్యలను పరిష్కరించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు మంత్రి పేర్ని నాని చిరంజీవి, నాగార్జున మరి కొందరు సినీ ప్రముఖుల సూచనల మేరకు ఆన్ లైన్ ద్వారా టికెట్లు విక్రయించడాన్ని పరిశీలిస్తున్నామని

చెప్పగా జరగబోయే సమావేశంలో ఆన్ లైన్ టికెట్లకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని దర్శకనిర్మాతలు భావిస్తుండటం గమనార్హం. లవ్ స్టోరీ సినిమా మేకర్స్ సైతం ఈ మీటింగ్ వల్ల మేలు జరుగుతుందని భావిస్తున్నారు. లవ్ స్టోరీ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus