కొత్త సినిమా కథను షూటింగ్ కి ముందే మావయ్యకు చెప్పిస్తున్నాడు!

  • November 2, 2018 / 01:30 PM IST

సుప్రీం హీరో సాయి ధ‌ర‌జ్ తేజ్ వ‌రుస ప‌రాజ‌యాల‌తో సత‌మ‌తమ‌వుతున్నాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో హిట్ త‌ప్పని స‌రి. తాజాగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి చిత్ర‌ల‌హ‌రి అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. సాధారణంగా తేజు తన సినిమాల ఎడిటింగ్ సమయంలో చిరూకి చూపించి సలహాలు, సూచనలు అడిగేవాడు. అలాంటిది “చిత్రలహరి” షూటింగుకి ముందే కథను చిరంజీవికి చెప్పించాడట. దాంతో చిరంజీవి కొన్ని మార్పులు, చేర్పులు చెప్పినట్టుగా సమాచారం. ప్రస్తుతం వాటిని సెట్ చేసే పనిలోనే కిషోర్ తిరుమల వున్నాడని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.

చిరంజీవి సూచనలు 90% వర్కవుట్ అవుతాయి. ఎందుకంటే.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సక్సెస్ అయినవాళ్ళందరూ ఆయన సలహాలు తీసుకొన్నవారే. సో, మంచి టాలెంట్ ఉన్న తేజ్ బాబు గనుక మావయ్య సలహాలు ఫాలో అయ్యాడంటే.. ప్రస్తుతం ఉన్న తేజ్ అందులో నుంచి బయటపడడమే కాక తన తోటి హీరోలైన వరుణ్ తేజ్ ను అందుకోవడం కూడా ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus