చిరు 152 నైజాం హక్కులు దక్కించుకున్న దిల్ రాజు..?

  • January 25, 2020 / 03:41 PM IST

ఎందరు హీరోలొచ్చినా టాలీవుడ్ లో మెగాస్టార్ మేనియానే వేరు. 60ప్లస్ లో కూడ ఆయన సైరా లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేసి తానేమిటో నిరూపించారు. సైరా టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్సింగ్ చిత్రాలలో ఒకటిగా ఉంది. పాలిటిక్స్ నుండి బయటికొచ్చి దాదాపు పదేళ్ల గ్యాప్ తరువాత చేసిన కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150 అనేక కొత్త రికార్డులు నెలకొల్పింది. కాగా ఆయన ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ మూవీ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది.

దర్శకుడు కొరటాల శివ, ఈ మూవీ స్క్రిప్ట్ పై ఏడాది పాటు పని చేశారు. చిరు ఇమేజ్ కి తగ్గట్టుగా ఆయన సోషల్ కాన్సెప్ట్ తో కూడిన ఓ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారట. ఈ కాంబినేషన్ కి ఉన్న డిమాండ్ దృష్ట్యా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నైజాం హక్కులని భారీ ధర చెల్లించి దక్కించుకున్నాడని తెలుస్తుంది. మూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి కాకుండానే మంచి ఫ్యాన్సీ ధర చెల్లించి దిల్ రాజు నైజాం హక్కులు చేజిక్కించుకున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus