చిరు, బాలయ్య చిత్రాలు సెన్సార్ కి వెళ్ళేది అప్పుడే

  • December 29, 2016 / 09:26 AM IST

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ చిత్రాల పోరు జోరందుకుంది. పద మూడేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడుతుండడంతో ఈ యుద్ధం ఆసక్తికరంగా మారింది. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ నంబర్ 150 అంటూ వస్తుండగా, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఇద్దరూ చెరోదారిలో ప్రచారానికి తెరలేపారు. మెగాస్టార్ ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంటే.. నటసింహ ట్రైలర్ తో సంచనం సృష్టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాలు సెన్సార్ కి వెళ్లే డేట్ ఫిక్స్ చేశారు. మాస్ డైరక్టర్ వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరు 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150 ఈరోజు(గురువారం) సెన్సార్ కి వెళ్లనుంది.

ఉత్తమ చిత్రాలందించే క్రిష్ డైరక్షన్లో రూపుదిద్దుకున్న గౌతమి పుత్ర శాతకర్ణి కి ఎడిటింగ్ డబ్బింగ్ పూర్తి అయినప్పటికీ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్ మిక్స్ చేస్తున్నారు. కాబట్టి వారం ఆలస్యంగా జనవరి 5 న సెన్సార్ కి వెళ్లనుంది.  ఖైదీ నెం.150 కి ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించక పోవడంతో జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి కి అటువంటి కార్యక్రమం ఏమి లేదని సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus