“మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోమో రిలీజ్ చేసిన మాటీవీ

  • September 28, 2016 / 01:40 PM IST

“కోటి హృదయాలను కొల్లగొట్టినవాడు.. మీతో కోటి గెలిపించడానికొస్తున్నాడు ..” అంటూ మా టీవీ రిలీజ్ చేసిన ప్రోమో అదరగొడుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా అలరించిన  “మీలో ఎవరు కోటీశ్వరుడు” కి ఈ సారి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఛానల్ వారు ఈ షో ప్రోమో ని మంగళవారం విడుదల చేశారు.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి స్టైల్ షో పై ఆసక్తిని పెంచింది. బుల్లి తెర పైన కూడా మెగాస్టార్ రికార్డులు సృష్టించడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం తన 150 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు ఎంఈకె కోసం టైమ్ కేటాయించనున్నారు. మెగాస్టార్ వెండి తెర రీ ఎంట్రీ కంటే బుల్లి తెర ఎంట్రీ ముందుగానే జరగనుంది. ఖైదీ నంబర్ 150  మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలవుతుంటే.. దానికంటే ముందే మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4 ప్రసారం కానుంది. డిసెంబర్ 12 నుంచి ఈ షో టెలికాస్ట్ కానుందని మాటీవీ స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus