టాలీవుడ్లో మరో విషాదం.. సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

  • March 6, 2023 / 12:49 PM IST

టాలీవుడ్‌లో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది చివర్లో కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి దిగ్గజాలు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది ఆల్రెడీ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు, దర్శకుడు సాగర్,కళాతపస్వి కె విశ్వనాథ్ వంటి వారు మరణించడం జరిగింది. వారి మరణంతో టాలీవుడ్ షాక్ లో మునిగిపోయిందనే చెప్పాలి. ఆ షాక్ నుండి ఇంకా కోలుకోకుండానే మరో కెమెరామెన్‌ కన్నుమూయడం మరింత విషాదకరం అని చెప్పాలి.

మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న సెలబ్రిటీల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఇక విషయంలోకి వెళితే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ప్రవీణ్‌ అనుమోలు నిన్న అంటే ఆదివారం నాడు హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. 2017లో సుకుమార్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన `దర్శకుడు` చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు ప్రవీణ్‌ అనుమోలు. గతంలో `బాజీరావు మస్తానీ, `ధూమ్‌3`, `బేబీ`, `పంజా`, `యమదొంగ` చిత్రాలకు ఆయన అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా పనిచేశారన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.

అయితే `ద‌ర్శ‌కుడు` చిత్రంతో ఈయన సినిమాటోగ్రాఫ‌ర్‌గా మారారు. అశోక్ బండ్రెడ్డి హీరోగా న‌టించిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా న‌టించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన ఇంకొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సినిమాటోగ్రఫర్‌గా గా టాప్ ప్లేస్ కు చేరుకుంటున్న ప్రవీణ్ ఇలా సడన్ గా గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ప్రవీణ్ మరణానికి చింతిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలు తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus