నిర్మాతని లెక్కలు చూపమన్న… డైరెక్టర్ బోయపాటి శ్రీను ..!

  • February 9, 2019 / 05:54 AM IST

రాంచరణ్ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లు కూడా దాదాపు 25 కోట్లు వరకూ నష్టపోయినట్టు తెలుస్తుంది. దీంతో రాంచరణ్ తన అభిమానులకు ఓ లేఖ కూడా రాశాడు. ఇక పై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్ లో పేర్కొన్నాడు. అంతే కాదు రాంచరణ్ తన రెమ్యునరేషన్ లో ఐదు కోట్లు తిరిగి ఇస్తానని చెప్పాడట, మీరు కూడా అలా చేస్తే బయ్యర్లకు కొంతవరకు డబ్బుని తిరిగి ఇవ్వొచ్చని దర్శక నిర్మాతల వద్ద ఓ ప్రతిపాదన కూడా తీసుకొచ్చాడట చరణ్. దీనికి నిర్మాత దానయ్య ఒప్పుకున్నప్పటికీ .. బోయపాటి మాత్రం స్పందించడం లేదట.

ఈ క్రమంలో దిల్ రాజు లాంటి బడా డిస్ట్రిబ్యూటర్ ని పెద్దమనిషిగా కూర్చోబెట్టి రీసెంట్ గా ఓ మీటింగ్ ఏర్పాటు చేశారట. ఈ మీటింగ్ లో బోయపాటి ఐదు కోట్లు తిరిగివ్వలేనని, ఒకటో రెండు కోట్లో సర్దుతానని అన్నాడట. దీంతో నిర్మాత దానయ్య సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని, వంద కోట్లు సినిమా పై ఖర్చు పెట్టించి.. బ్యాడ్ అవుట్ పుట్ ఇచ్చి ఇప్పుడు డబ్బు తిరిగివ్వనంటే ఎలా అంటూ.. బోయపాటిని ప్రశ్నించాడట. బోయపాటి కూడా సీరియస్ అవ్వడంతో ఒకరినొకరు బూతులు తిట్టుకునే వరకూ వ్యవహారం వెళ్ళిందని తెలుస్తోంది. అసలు ఈ సినిమాకు పెట్టిన ఖర్చు, బిజినెస్ డీల్స్, ఎంత వెనక్కి వచ్చింది..సాటిలైట్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ ద్వారా ఎంతంత రికవరీ అయ్యిందో చెప్తే తను ఎంత వెనక్కి ఇవ్వాలనేది నిర్ణయించుకుంటానని బోయపాటి కూడా గట్టిగా అడిగినట్లు సమాచారం. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన కొందరు పెద్ద మనుషులు వాళ్ళని శాంతపరిచారట. మరి ఈ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియాల్సి ఉంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus