నేనే రాజు నేనే మంత్రిలో హైలెట్ కానున్న క్లైమాక్స్

  • June 17, 2017 / 12:17 PM IST

బాహుబలి సినిమా తర్వాత దగ్గుబాటి రానా హీరోగా చేస్తున్న సినిమా “నేనే రాజు నేనే మంత్రి”. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కర్నూలు జిల్లా బనగానపల్లిలో జరిగిన షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ మూవీలో  క్లైమాక్స్ హైలెట్ కానుందని సమాచారం. ఈ చిత్రంలో రాజకీయనాయకుడైన హీరోకి ఉరిశిక్ష వేస్తారు. కాసేపట్లో ఉరితీస్తారనగా పారిపోతాడు. తనపై పడిన నిందను తొలగించుకొని రిలీజ్ అవుతాడు. ఈ సన్నివేశం సినిమాలోనే హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది.

ఇందులో రానా నటన అద్భుతంగా ఉంటుందట. టీజర్ లో చూపించిన వీడియో ఆ సీన్ లోనిదే. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం అనూప్ రూబెన్స్ సమకూర్చిన పాటలు త్వరలో రిలీజ్ కానున్నాయి. వచ్చే నెల మూవీ థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus