సోషల్ మీడియాలో వైరల్ అయిన పూనమ్ ట్వీట్స్

  • October 7, 2018 / 03:41 AM IST

పూనమ్ కౌర్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువమందికి తెలుస్తోంది. ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందంటే…  మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించిన ఈ భామకి సరైన హిట్ దక్కలేదు. స్వర్ణఖడ్గం వంటి సీరియల్లో నటించినా గుర్తింపు లభించలేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లపై ఇండైరెక్ట్ గా ట్వీట్స్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.  తాజాగా మరో ట్వీట్ ద్వారా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓటుకు నోటు కేసుపై పూనమ్ స్పందిస్తూ… “ఆంధ్రా.. తెలంగాణ అంటూ మన వాళ్లే కొట్టుకుంటూ ఉంటే లాభం ఎవరికబ్బా? నాకు అయితే ఏమీ అర్థం కావడం లేదు. వీళ్లను చూస్తుంటే పిల్లి-పిల్లి తగువును కోతి తీర్చిన కథ గుర్తుకు వస్తోంది” అంటూ ట్వీట్ చేసింది.

దీంతో ఆనంద్ రెడ్డి కోలా అనే నెటిజన్ .. “ఓటుకు నోటు వల్ల లాభం ఎవరికి? అసలు ఎంతమాత్రం ఆలోచించకుండా చేసిన రాజకీయ ట్వీట్ ఇది. మీరు ఎంత మాట్లాడినా మీవల్ల టీడీపీకి ఒక్క ఓటు కూడా రాదు” అని ట్వీట్ చేశాడు. అతను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. దీంతో పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది. “నువ్వు ఎవరి ఫొటో పెట్టుకున్నావో.. ఆ పెద్దమనిషి విలువ తీయకు. ఇలాంటి అసభ్యకరమైన భాషను సోషల్ మీడియాలో వాడుతున్నావా? ఇదేమన్నా సినిమానా పంచులు వేయడానికి. ఎన్నో కుటుంబాలు, ప్రజలు మీకోసం చూస్తున్నప్పుడు వాడే భాష ఇదేనా? నీ వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయ్” అని విరుచుకుపడింది. దీంతో అతను సైలెంట్ అయిపోయాడు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus