టాలీవుడ్‌లో మరో విషాదం.. కమెడియన్ వేణు మాధవ్ కన్నుమూత!

  • September 25, 2019 / 01:21 PM IST

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం మరణించారు.నిన్న తీవ్రమైన అనారోగ్యంతో ఉండగా.. ఆయన కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటి వరకూ చికిత్స పొందుతూ వచ్చిన వేణు మాధవ్ కొద్దిసేపటి క్రితం మరణించారు. గత కొంతకాలంగా లివర్ తదితర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు వేణు మాధవ్.

ఈయన చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. అంతేకాదు ఈయన కామెడీ వల్లే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడవటంతో వేణు మాధవ్ సినిమాలు తగ్గించేసారు. ఈ విషయం బయటకు రాగానే టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. వేణు మాధవ్ లాంటి టాప్ కమెడియన్ మరణించడం టాలీవుడ్ కు తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus