బిగ్‌బాస్ హౌస్ నిర్వాహకులపై కేస్ నమోదు చేసిన లాయర్!

  • August 4, 2018 / 04:54 AM IST

బిగ్‌బాస్ హౌస్‌లో మాటలు శృతి మించుతున్నాయి. పార్టిసిపెంట్స్ సొంత అభిప్రాయాలు సో నిర్వహుల మెడకు చుట్టుకున్నాయి. స్టార్ మా ఛానల్ ల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో ఇంత గొడవ ఎప్పుడు జరిగిందని ఆలోచనలో పడకండి. మేము చెప్పేది.. తమిళ బిగ్ బాస్ హౌస్ లోని గొడవ గురించి. హౌస్‌లోని కంటెస్టెంట్ ఐశ్వర్య.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిక్టేటర్‌గా వ్యవహరించి రాష్ట్రాన్ని పాలించారని ఆరోపించారు. ఆమె ఆవిధంగా అన్నప్పుడు కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడంతో దుమారం రేగింది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్.. బిగ్‌బాస్ హౌస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితను అవమానించేలా మాట్లాడారని మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ లౌసీల్ రమేశ్ గ్రేటర్ చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

కమల్ తన రాజకీయ ప్రయోజనాల కోసం షోను వాడుకుంటున్నారని.. షోలో జయలలితను అవమానించేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అవమానిస్తున్న కమల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్న షో శనివారం ప్రసారం కానుంది. ఈ షో చూస్తేకానీ నిజంగా కమల్ నిజంగా జయను అవమానించేలా వ్యాఖ్యలు చేశారా? లేదంటే ప్రోమో కోసం అలా ఎడిట్ చేశారా? అనే విషయంలో క్లారిటీ రానుంది. అంతకంటే ముందే  అంటే ఈరోజు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కమల్ హాసన్ సందడి చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus