కరోనా ఎఫెక్ట్.. ఎన్టీఆర్ పై అలా పడిందన్నమాట..!

  • November 7, 2020 / 04:10 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం నుండీ ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్.. ఈ మధ్యనే విడుదలయ్యి యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తుంది. కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ… ‘రామరాజు ఫర్ భీమ్’ అభిమానులను ఆనందపరుస్తున్నాడనే చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ హైదరాబాద్‌లోని నగర శివార్లలో జరుగుతుంది. సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ఈ నేపథ్యంలో ఎవ్వరూ కరోనా భారిన పడకుండా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నాడట రాజమౌళి. యూనిట్ సభ్యులందరినీ తమ ఇళ్ల నుండే భోజనం తెచ్చుకోవాలని ఆర్డర్ వేసాడట.

ఈ క్రమంలో ఎన్టీయార్.. కూడా షూట్ పూర్తయిన తరువాత ఇంటికి వెళ్లకుండా…ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడని సమాచారం. ఎన్టీఆర్ ఇంట్లో తన భార్య, ఇద్దరు పిల్లలు అలాగే పెద్ద వయసు కలిగిన ఆమె తల్లి ఉన్నారు కాబట్టి… తన వల్ల ఎటువంటి ప్రతికూలత ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడట. షూటింగ్ అయిపోయిన తరువాత తన రూమ్ కు వెళ్ళి.. తన ఫ్యామిలీ మెంబర్స్ తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడట ఎన్టీఆర్.

అంతేకాదు తన కోసం స్వయంగా తనే వంట చేసుకుని తింటున్నట్టు కూడా సమాచారం. రాజమౌళి ఆదేశం మేరకు బయట ఫుడ్ ను ఎన్టీఆర్ దూరం పెట్టాడట. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత కూడా 2 వారాల పాటు హోమ్ క్వరెంటైన్లో ఉండాలని .. ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టు … అతని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఏమైనా ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఎన్టీఆర్.. ఫ్యామిలీని దూరం పెట్టక తప్పడం లేదని స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus