అత్తారింటికి వెళ్ళి… అందరికీ కరోనా అంటించేసిన నటి కొడుకు..!

  • May 12, 2020 / 04:30 PM IST

తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి.. ఇక లాక్ డౌన్ ఎత్తేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అని ఒకింత ఊరట వచ్చిన సందర్భంలో… గత శనివారం నుండీ మళ్ళీ కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. గత శుక్రవారం వరకూ 10 లేదా.. అంతకంటే తక్కువ కేసులు మాత్రమే నమోదు అయ్యేవి. కానీ శనివారం నాడు 31, ఆదివారం నాడు 33 కేసులు నమోదయ్యి అందరికీ షాకిచ్చాయి. నిన్న సోమవారం నాడు అయితే ఏకంగా తెలంగాణ మొత్తం కలిపి 79 కేసులు నమోదు అయ్యాయట.

మూసాపేట, యూసుఫ్ గూడ, చాదర్ ఘాట్, మలక్ పేట, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదవ్వడం గమనార్హం. ఇక ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందరితో మాట్లాడటానికి లైవ్ లోకి రానున్నారు. మరి ఆయన ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు అని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే.. దిల్ సుఖ్ నగర్ సమీపంలోని ఓ అపార్టు మెంట్ లో.. 9 మంది కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

వీరిలో ఒక ప్రముఖ సినీ నటి కొడుకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల అత్తగారింటికి వచ్చిన ఆ నటి కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. వైరస్ సోకినట్లు ఆ నటి కొడుకుకి తెలియకపోవడంతో అపార్టుమెంట్ లో ఉంటున్న వారందరితోనూ రాసుకుని పూసుకుని తిరిగేససాడట. దీంతో ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న 27 మందికి కూడా కరోనా పరీక్షల చేయించాలి అని హాస్పిటల్ కు తరలించారట. అయితే ఆ నటి ఎవరు… అతని కొడుకు ఎవరు అనే విషయాల్ని ప్రస్తుతం పోలీస్ వారు సీక్రెట్ గా ఉంచుతున్నారట.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus