క్రిమినల్ కేసులో ఇరుక్కున్న షాలినీ పాండే.?

  • December 24, 2019 / 10:33 AM IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఈమెకు వరుస అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ అంతా అనుకున్నట్టు ఆమెకు అవకాశాలు ఎక్కువ రాలేదనే చెప్పాలి. ‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘118’ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి సడెన్ గా కాలీవుడ్, బాలీవుడ్ నుండీ కూడా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈమె ప్రస్తుతం ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కుంది అనే వార్త ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యింది.

అసలు విషయాన్ని పరిశీలిస్తే.. షాలినీ పాండే.. విజయ్ ఆంటోనీ సరసన ‘అగ్ని సిరాగుగల్’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసిందట. నవీన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లో షాలినీ కేవలం 27 రోజులు మాత్రమే పాల్గొని ఆ తరువాత సెట్స్ కి రావడం మానేసిందట. అంతేకాదు ఇక షూటింగ్ పాల్గొనడం కుదరదు అని తేల్చి చెప్పేసింది. దీంతో నిర్మాత అయిన శివ.. షాలినిని ఒప్పించే ప్రయత్నాలు చేసాడట. అయినా ఆమె కన్విన్స్ కాలేదట. దీంతో తెలుగు, తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో షాలిని పై పిర్యాదు చేశారు. ‘రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్ పూర్తిచేయలేదని’ కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు పోలీస్ స్టేషన్ లో షాలినీ పై క్రిమినల్ కేసు కూడా పెట్టారని సమాచారం. ‘బాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు వస్తుండడంతో సౌత్ సినిమాలను సరిగ్గా పట్టించుకోవట్లేదని’.. ఫిలింనగర్లో ఈమె గురించి డిస్కషన్లు మొదలయ్యాయి. మరి ఈ విషయం పై షాలినీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus