అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దాసరి నారాయణరావు

  • January 31, 2017 / 06:31 AM IST

వందకు పైగా చిత్రాలను డైరక్ట్ చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు  హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో  చేరారు. కొన్నిరోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉదయం ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. ప్రస్తుతం దాసరికి సీనియర్ వైద్య నిపుణులు  చికిత్స అందిస్తున్నారు. “దాసరి నారాయణరావుకి సరైన చికిత్స అందుకొంది. ఎవరూ కంగారు పడనవసరం లేదు. మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు” అని కిమ్స్ వైద్యులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

దాసరి ఆస్పత్రిలో చేరిన వార్త విని సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆందోళన పడ్డారు. అయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాసరి వద్ద దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకున్న శిష్యులు, నటులు కిమ్స్ ఆస్పత్రికి ఒకొక్కరుగా చేరుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus