ఎన్టీఆర్ 27 వ మూవీకి సంగీత మందించనున్న దేవీ శ్రీ ప్రసాద్

  • February 8, 2017 / 01:02 PM IST

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ ఫిక్స్ అయ్యారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.  దీంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపికను దర్శక నిర్మాతలు పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరక్టర్ గా ఖరారు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. తారక్ గత చిత్రం జనతా గ్యారేజ్ కూడా దేవీ చక్కని ఆల్బమ్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు బలాన్నిచ్చారు.

అందుకే తారక్ ఈసారి కూడా రాక్ స్టార్ కే ఛాన్స్ ఇచ్చారు. నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసరవెల్లి , నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ చిత్రాలకు దేవీ శ్రీ ప్రసాద్ పనిచేశారు. ఇప్పుడు వరుసగా (నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్) మూడో చిత్రానికి ఎంపిక చేయడం విశేషం. “జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా, జెంటిల్ మాన్ భామ నివేత థామస్ నటించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus