రెమ్యూనరేషన్ లేకుండానే నటిస్తున్న ధనుష్..!

  • June 4, 2016 / 01:23 PM IST

దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా బాలీవుడ్ లో రూపొందిస్తున్న చిత్రం ‘నిమ్మో’. ఆనంద్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రకుల్ శంకల్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కరణ్ దేవ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ధనుష్ అతిధి పాత్రలో నటించనున్నాడు.

అయితే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను ధనుష్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని అంటున్నారు. కాగా రంజనాః చిత్రం ద్వారా ధనుష్ ను ఆనంద్ బాలీవుడ్ కు పరిచయం చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే.. ధనుష్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని అంటున్నారు. కాగా ప్రస్తుతం ధనుష్ ఎన్నై నొక్కి పాయుమ్ తోటా, కోడి, తోదారి చిత్రాల్లో నటిస్తుండగా.. కోడి, తోదారి చిత్రాలు విడుదలకు సిద్దమౌతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus