సినిమా అంటే ఇలా ఉండాలి.. సీక్వెల్ అంటే ఇలా ఉండాలి.. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి.. యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి.. అంటూ గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమలో, అభిమానుల్లో రెండు సినిమాల గురించి చర్చ జరుగుతోంది. అవే ‘ధురంధర్’, ‘ధురంధర్ ’. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ రెండు సినిమా ఉమ్మడిగా బాక్సాఫీసు దగ్గర రూ.3200 కోట్లు వసూలు చేశాయి. ఈ రెండు సినిమాల బడ్జెట్ రూ.250 కోట్లు కావడం గమనార్హం.
రెండో పార్టు ‘ధురంధర్’ సినిమా వచ్చి 50 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ఓ సర్ప్రైజ్కి టీజర్ ఇచ్చింది. సినిమా నిర్మాతల్లో ఒకరైన జ్యోతి దేశ్పాండే ‘ధురంధర్’ ఇంకా అయిపోలేదు.. ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం’ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొస్తూ పై మాట అన్నారు. ‘ధురంధర్’ నుండి ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పారామె.
మా దగ్గర ఒక ప్లాన్ సిద్ధంగా ఉంది. మా అందరికీ హిట్ అత్యంత అవసరమైన సమయంలో ‘ధురంధర్’ను తెరకెక్కించాం. దీంతో నేను, ఆదిత్య, రణ్వీర్ సింగ్ ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం అని చెప్పారామె. ఆ తర్వాత సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు టీమ్ అందరినీ మరింత దగ్గర చేశాయి అని నాటి విషయాలు చెప్పుకొచ్చారు. అయితే ఆ సర్ప్రైజ్ ఏంటి అనేదే ఇప్పుడు చర్చగా మారింది. మూడో ‘ధురంధర్’ ప్రకటన ఏమన్నా చేస్తారా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది.
అయితే కొత్త సినిమా ఏమీ కాదని, ‘ధురంధర్’ సినిమాల మేకింగ్కు సంబంధించిన ఓ డాక్యుమెంటరీ రిలీజ్ చేయవచ్చని ఆ అంచనాల సారాంశం. మరి అదే వస్తుందా? లేక ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందే.