Dil Raju: మరోసారి బిజీ అయిపోయిన దిల్ రాజు!

  • December 6, 2021 / 10:38 AM IST

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు ఆ తరువాత నిర్మాతగా మారి భారీ సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు. అలా అని డిస్ట్రి బ్యూషన్ ను పక్కన పెట్టలేదు. ఆ మధ్య కొంతకాలం పాటు నైజాంలో వేరే డిస్ట్రిబ్యూటర్లతో పోటీ ఎదురైంది. ఇప్పుడు మళ్లీ సినిమాలన్నీ దిల్ రాజుని వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఇప్పటికే ఆయన రెగ్యులర్ బ్యానర్ల నుంచి భారీ సినిమాలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘రాధేశ్యామ్’ ఉండనే ఉన్నాయి. ‘పుష్ప’ సినిమా ముందుగా వేరే వాళ్లకు ఇవ్వాలనుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా దిల్ రాజు చేతుల్లోకి వచ్చింది. అది కూడా చాలా రీజనబుల్ రేటుకి రావడం విశేషం. రూ.36 కోట్లకు ‘పుష్ప’ సినిమా నైజాం హక్కులు దిల్ రాజుకి దొరికాయి. మొదట్లో నిర్మాతలు రూ.45 కోట్ల దగ్గర కోట్ చేశారు. కానీ దిల్ రాజు దగ్గరకు వచ్చిన తరువాత అది రూ.36 కోట్లకు ఫైనల్ అయింది.

‘అఖండ’ సినిమాను కూడా నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. రూ.10.50 కోట్లకు ఆయన నైజాం హక్కులు తీసుకోగా.. ఇప్పుడు తొలివారంతోనే లాభాల్లోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus