Dil Raju: సంక్రాంతి వార్‌ గురించి.. మౌనం వీడనున్న దిల్‌ రాజు!

  • November 26, 2022 / 12:24 PM IST

వచ్చే ఏడాది సంక్రాంతి వార్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ చర్చకు కారణమైన వ్యక్తి మాత్రం నోరు మెదపడం లేదు. అయితే ఆయన వాయిస్‌ వేరే వాళ్ల మాటల్లో వినిపిస్తోంది అనేది మరో మాట. దీంతో ఇండస్ట్రీలో నిర్మాతల మండలి వర్సెస్‌ కొంతమంది నిర్మాతలు అనే డిస్కషన్‌ మరో వైపు నడుస్తోంది. అయితే పొంగల్‌ ఫైట్‌కు కారణమైన వ్యక్తి త్వరలో స్పందించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది… ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు.

సంక్రాంతి సీజన్‌లో ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం నాలుగు సినిమాలు బరిలో ఉంటాయి. రెండు తమిళ సినిమాలు అయితే, రెండు తెలుగు సినిమాలు. దీంతో వచ్చే సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మాతల మండలి ఓ లేఖ రిలీజ్‌ చేసింది. దీంతో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ లోపు అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌ లాంటి నిర్మాతలు.. మండలి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో వీళ్ల వెనుక దిల్‌ రాజు ఉన్నారేమో అని కొందరు విమర్శలు కూడా చేశారు.

అయితే దిల్‌ రాజు త్వరలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అని సమాచారం. నిజానికి ‘కార్తికేయ-2’ సినిమా సమయంలోనే దిల్‌ రాజు మీద విమర్శలు వచ్చాయి. తన సినిమా ‘థ్యాంక్‌ యూ’ కోసమే ఆయన ‘కార్తికేయ 2’ వాయిదా వేయించారు అంటూ.. ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఆ సినిమా సక్సెస్‌ మీట్‌లో మాట్లాడి క్లియర్‌ చేసే ప్రయత్నం చేశారు. మళ్లీ ఇప్పుడు ‘వరిసు’ కోసం ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు సరైన థియేటర్లు రాకుండా చేస్తున్నారనేది తాజా విమర్శ.

ఇన్ని రోజులు ఈ విషయమై మౌనంగా ఉన్న దిల్‌ రాజు త్వరలో ప్రెస్‌ మీట్‌ పెట్టి ‘వరిసు’ రిలీజ్‌ ఇష్యూ గురించి మాట్లాడతారట. ప్రతి విషయంలోనూ తనను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తనలో రెండో కోణం ఎవరికీ తెలియదని రాజు అన్నారు. ఈ నేపథ్యంలో దిల్‌ రాజు ఏం మాట్లాడతారో అనే ఆసక్తి మొదలైంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus