Son Of India: అలా చేసి ఉంటే సన్నాఫ్ ఇండియా బ్లాక్ బస్టర్.. డైరెక్టర్ ఏమన్నారంటే?

  • June 7, 2023 / 02:48 AM IST

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన డైమండ్ రత్నబాబు తక్కువ సినిమాలనే తెరకెక్కించినా ఈ దర్శకునికి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ స్టాపబుల్ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైమండ్ రత్నబాబు షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. సన్నాఫ్ ఇండియా కథను రజనీకాంత్ కు చెప్పానని ఆయన తెలిపారు. మోహన్ బాబు గారి వల్ల రజనీకాంత్ తో ఫోన్ లో మాట్లాడే అవకాశం దక్కిందని డైమండ్ రత్నబాబు అన్నారు.

సన్నాఫ్ ఇండియా (Son Of India) కథ విని రజనీకాంత్ ఆ మూవీ కథ చాలా బాగుందని అన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సన్నాఫ్ ఇండియా సినిమాతో నేను చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదని డైమండ్ రత్నబాబు వెల్లడించడం గమనార్హం. 500 మంది నటీనటులు, జూనియర్ ఆర్టిస్ట్ లతో సన్నాఫ్ ఇండియా తీసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మారేదని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మరో ఛాన్స్ దక్కితే ఈ సినిమాను రీమేక్ చేయాలని ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

డైమండ్ రత్నబాబు (Diamond Ratnababu) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైమండ్ రత్నబాబు తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో అన్ స్టాపబుల్ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అన్ స్టాపబుల్ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం గమనార్హం. అన్ స్టాపబుల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. డైమండ్ రత్నబాబు పలు సినిమాలకు రైటర్ గా కూడా పని చేశారు. డైమండ్ రత్నబాబు అల్లు అర్జున్ వల్లే తన కెరీర్ మారిందని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus