సాహో తర్వాత ఆ డైరక్టర్ తో మూవీ చేయనున్న ప్రభాస్!

  • September 26, 2017 / 06:35 PM IST

బాహుబలి తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన సుజీత్ .. ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి చిత్రాలతో ఉత్తమ రచయితగా పేరు తెచ్చుకున్న వంశీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో “నా పేరు సూర్య” సినిమాని చేస్తున్నారు. డైరక్టర్ గా ఇదే అతని తొలి సినిమా. ఈ మూవీ షెడ్యూల్ గ్యాప్ లో ప్రభాస్ కి ఓ కథ చెప్పారంటా. అది ప్రభాస్ కి నచ్చడంతో అతను వెంటనే ఓకే చెప్పారని సమాచారం. సో సాహో తర్వాత ప్రభాస్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ విషయం ఇంకా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus