Krish: కొత్త టాక్‌: ఆ సినిమా డౌట్‌… క్రిష్‌ రూట్‌ మార్చేస్తున్నారా?

  • January 6, 2024 / 02:59 PM IST

పవన్‌ కల్యాణ్‌తో సినిమా ప్రారంభించి… ఇప్పుడు ఖాళీగా ఉన్న దర్శకులు ముగ్గురు. అయితే హరీశ్‌ శంకర్‌ ఇటీవల ‘మిస్టర్‌ బచ్చన్‌’ ప్రారంభించడంతో ఇద్దరే మిగిలారు. ఒకరు ‘హరి హర వీర మల్లు’ తీస్తున్న క్రిష్ అయితే, మరొకరు ‘ఓజీ’ చేస్తున్న సుజీత్‌. ఇందులో ఒకరు మరో సినిమా కథతో సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఆయనే క్రిష్‌. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా మారడంతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అయిన తర్వాత పవన్‌ తిరిగి ముఖానికి రంగేసుకుంటారని టాక్‌. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమాలు సెట్స్‌ మీద పెట్టుకున్న దర్శకులు ఈ లోపు వేరే సినిమాలు చేసుకోవచ్చని సందేశం ఇన్‌డైరెక్ట్‌గా వచ్చేసింది. దీంతో క్రిష్ కూడా మరో కథతో సిద్ధమయ్యారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా అనౌన్స్‌మెంట్, ప్రారంభం వెంటవెంటనే అయిపోతాయి అని టాలీవుడ్‌ లేటెస్ట్‌ టాక్‌.

‘హరి హర వీరమల్లు’ సెట్స్‌ మీద ఉండగానే ‘కొండపొలం’ అనే సినిమా చేశారు క్రిష్. ఆ తర్వాత ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ‘9 అవర్స్’ వెబ్‌ సిరీస్‌ తీయించారు. ఆ తర్వాత ‘కన్యాశుల్కం’ ఆధారంగా అంజలి – అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో సిరీస్ పూర్తి చేశారు. శేష సిందూరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు చేయించడం కాకుండా చేద్దాం అనే ఆలోచనకు వచ్చాకట.

ఈ క్రమంలో ఓ లేడీ ఓరియెంటెడ్ కథని సిద్ధం చేసుకున్నారట క్రిష్. అయితే హీరోయిన్ కోసం వెతుకులాట కొనసాగుతోందట. ఆయన మనసులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని… అయితే వాళ్లిద్దరూ అంత ఈజీగా ఓకే చెప్పరు కాబట్టే ఈ చర్చ ఓ లెక్కకు రావడం లేదు అంటున్నారు. క్రిష్ ఆలోచనల్లో అయితే అనుష్క, నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల అనుష్క సినిమాలు ఓకే చేయడం లేదు. ఇక నయన్‌ అంటే భారీ బడ్జెట్‌ అవసరం. దీంతో హీరోయిన్‌ తేలితే ఆ కథ పట్టాలెక్కుతుందట.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags