మారుతీ – గోపీచంద్ ల సినిమా అంతా ఉత్తుత్తేనా?

  • July 23, 2020 / 11:00 AM IST

‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు మారుతీ కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. వైరస్ మహమ్మారి కారణంగా చాలా సినిమాల షూటింగ్ లు మధ్యలోనే నిలిచిపోయాయి. దాంతో ఆ హీరోలు తరువాత చెయ్యాల్సిన సినిమాలు కూడా ఇంకా మొదలు కాలేదు. దాంతో స్టార్ హీరోల దగ్గరనుండీ మీడియం రేంజ్ హీరోలు మరియు చిన్న హీరోలు.. కూడా కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పే అవకాశం లేదు. ఇలాంటి టైములో గోపీచంద్ తో మారుతీ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని యూవీ వారు నిర్మిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది.

చెప్పాలంటే ఇది మంచి కాంబినేషనే..! గోపీచంద్ కు కూడా ఈ మధ్య కాలంలో హిట్టు లేదు కాబట్టి.. మారుతీ తో సినిమా చేసి అయినా హిట్టందుకుంటాడులే అని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో డైరెక్టర్ మారుతీ మాత్రం అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో ‘గోపీచంద్ తో సినిమా చెయ్యడం మారుతీకి ఇష్టం లేదు’ అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. తాజాగా మారుతీ మాట్లాడుతూ.. “సినిమా షూటింగ్ లు మొద‌ల‌వ్వ‌డానికి 3,4 నెలలు టైం పట్టేలా ఉంది. దాంతో ఏ హీరో.. ఎవ‌రికి అందుబాటులో ఉంటాడో తెలియని పరిస్థితి.

కాబట్టి ఆ టైంకి నా క‌థ‌కు ఎవ‌రు సూట‌వుతారో వాళ్ల‌నే హీరోగా ఎంచుకుంటాను. హీరోల కోసమని క‌థ‌లెప్పుడూ రాసుకోలేదు. క‌థ రాశాకే హీరోని వెతుక్కునే వాడిని. ఇప్పుడు కూడా అంతే..! కథ రాసుకుంటున్నాను… హీరో ఎవ‌ర‌న్న‌ది తరువాత డిసైడ్ అవుతుంది“ అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ. ఇప్పుడు గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ చేస్తున్నాడు. ఆ తరువాత తేజ డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అందుకే మారుతీ సినిమా వర్కౌట్ కావడం లేదేమో అని గుస గుసలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus