నాగచైతన్య సినిమాకి పరశురామ్ పారితోషికం ఎంతో తెలుసా..!

  • November 23, 2019 / 06:54 PM IST

పాపం పరశురామ్ కు భారీ సక్సెస్ దొరడానికే చాలా టైం పట్టింది. ‘గీత గోవిందం’ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు పరశురామ్(బుజ్జి). ఈ చిత్రం 125 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత పరశురామ్ బిజీ అయిపోతాడు.. పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తాడు అని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మొన్నటి వరకూ ‘గీత ఆర్ట్స్’ కాంపౌండ్ లో ఉండి హీరోకు ఎదురుచూసిన పరశురామ్ తర్వాత ఆ కాంపౌండ్ నుండీ బయటకి వచ్చి సొంత ప్రయత్నాలు చేసుకున్నాడు. మహేష్ బాబు తో సినిమా చేయాలనీ బాగా ప్రయత్నించాడు. కానీ ప్రస్తుతం మహేష్ బిజీ గా ఉండడంతో కుదర్లేదు.

చివరికి అఖిల్ కూడా బిజీగా ఉండడంతో నో చెప్పాడని తెలుస్తుంది. ఈ క్రమంలో నాగచైతన్య ఛాన్స్ ఇచ్చాడు. ’14 రీల్స్ ప్లస్’ నిర్మాణ సంస్థ ఈ చితీరాన్ని నిర్మించబోతుందట. ఈ ప్రాజెక్ట్ కోసం పారితోషికం కూడా భారీగా అందుకోబోతున్నాడని తెలుస్తుంది. ‘గీత గోవిందం’ సినిమా వరకూ కోటి లోపే రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చిన పరశురామ్ ఇప్పుడు ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ’14 రీల్స్’ వారు పరశురామ్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus