Parasuram: అది ఉద్దేశపూర్వకంగా చెప్పించిన డైలాగ్ కాదు : పరశురామ్

  • May 21, 2022 / 04:26 PM IST

గత వారం విడుదలైన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్‌ సముద్రఖని ఓ డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్‌ లక్ష్మీనృసింహస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని కొందరు పరశురామ్ బుజ్జి కి తెలియజేశారు.దీంతో అతను ఈ విషయం పై స్పందించి క్షమాపణలు తెలిపాడు. ‘సర్కారు వారి పాట’ చిత్రం సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుండడంతో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని శుక్రవారం నాడు దర్శించుకున్నారు దర్శకుడు పరశురామ్.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ” ‘సర్కారు వారి పాట’లో ఓ డైలాగ్‌ స్వామి వారి భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని కొందరు పాత్రికేయ మిత్రులు నాకు తెలియజేశారు.’అది ఉద్దేశపూర్వకంగా చెప్పించిన డైలాగ్ అయితే కాదు, ఆ విషయంలో కనుక భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి నేను చాలా పెద్ద భక్తుడిని.నాకు వీలు కుదిరినప్పుడల్లా స్వామిని దర్శించుకుంటూ ఉంటాను.

‘సర్కారు వారి పాట’ చిత్రం లాంచ్ అయినప్పుడు కూడా స్వామిని దర్శించుకున్నాను. ఫలితంగా సినిమా బాగా ఆడుతుంది. అది స్వామి వారి కృపగా నేను భావిస్తున్నాను” అంటూ పరశురామ్ చెప్పుకొచ్చాడు. అలాగే నాగ చైతన్యతో తన తర్వాతి చిత్రాన్ని చేయబోతున్నట్టు కూడా పరశురామ్ చెప్పుకొచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus