సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా రూపొందిస్తున్న అగ్ర ఆడియో సంస్థ

  • February 1, 2019 / 06:53 AM IST

“శతమానమ్ భవతి” చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న సతీష్ వేగేశ్న తదుపరి చిత్రమైన “శ్రీనివాస కళ్యాణం”తో మాత్రం డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాపం హీరో నితిన్, హీరోయిన్ రాశీఖన్నా, ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దాంతో సతీష్ వేగేశ్నకు మళ్ళీ అవకాశం రావడం కష్టమే అనుకున్నారందరూ. కానీ.. అందరి ఆలోచనలనూ తప్పని ప్రూవ్ చేస్తూ తన తదుపరి చిత్రాన్ని రెడీ చేసుకుంటున్నాడు సతీష్ వేగేశ్న.

ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆల్రెడీ కార్తీ నటించిన “ఖాకీ” చిత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడంతో నిర్మాణ రంగంలోకి వచ్చిన ఆదిత్య ఇప్పుడు సతీష్ వేగేశ్న సినిమాతో పూర్తిస్థాయి నిర్మాణ రంగంలోకి అడుగిడనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు మాత్రం గట్టిగా జరుగుతున్నాయి. అందరూ కొత్తవాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus