టాలీవుడ్ రీఎంట్రీకి భారీ ప్లాన్!

  • October 14, 2020 / 12:02 PM IST

సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత గోపీచంద్ హీరోగా తెలుగులో ‘శౌర్యం’ అనే సినిమా తీసి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శివ. కొన్నాళ్ల తరువాత గోపీచంద్ తోనే ‘శంఖం’ అనే మరో సినిమా తీశాడు. అది వర్కవుట్ కాలేదు. ఇక రవితేజతో తీసిన ‘దరువు’ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తన సొంత ఇండస్ట్రీ కోలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ ఆయన తీసిన సినిమాలు హిట్ అవ్వడంతో అజిత్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అజిత్ తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి సినిమాలు తీసి కోలీవుడ్ లో బిజీ డైరెక్టర్ గా మారాడు.

ప్రస్తుతం శివ.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘అన్నాత్తె’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తరువాత హీరో సూర్యతో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో పూర్తవుతాయి. ఆ తరువాత టాలీవుడ్ లో ఓ సినిమా చేయాలని శివ ప్లాన్ చేస్తున్నాడట. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్ లేదా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనేది శివ ఆలోచన. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో శివకి తిరుగులేదు.

తమిళంలో అతడి సక్సెస్ రేట్ చూస్తే.. ఇక్కడి స్టార్ హీరోలు నో చెప్పే అవకాశం లేదు. పైగా మన హీరోలు మాస్ కథలంటే మరింత ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి శివ అనుకుంటున్నట్లు బన్నీ, ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు తనకి డేట్లు ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మరి శివ ప్రాజెక్ట్ ఎవరితో సెట్ అవుతుందో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus