రియల్ ఎస్టేట్ స్కామ్ పై గురిపెట్టిన డీజే

  • June 20, 2017 / 07:25 AM IST

సరైనోడు చిత్రం తర్వాత  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రానుంది. బ్రాహ్మణ యువకుడిగా, స్టైలిష్ గా డీజే లో బన్నీ అదరగొట్టనున్నట్లు టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి. అందుకే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ సినిమా కథ ఇదే నంటూ ఫిలిం నగర్లో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆంధ్రలో నడుస్తున్న ఓ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంను బేస్ గా చేసుకుని ఈ కథను తీర్చిదిద్దారని తెలిసింది.

పెద్దలంతా తెర వెనుక ఉండి నడిపించిన ఈ కుంభకోణంలో సామాన్యులు నిట్టనిలువునా మునిగిపోయారు. ఈ భూ కుంభకోణం నిగ్గు తేల్చే క్రమంలో యుద్ధం శరణం గచ్చామి అంటూ డీజే రంగంలోకి దిగుతాడన్నది టాక్. ఈ కథ నిజమో కాదో మూడు రోజుల్లో తెలియనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  పతాకంపై  భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus