Shaakuntalam: ‘శాకుంతలం’ అసలు కథ ఏంటో తెలుసా?

  • January 13, 2023 / 06:55 PM IST

‘యశోద’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో మూవీ క్రేజీ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. 5వ శతాబ్దంలో మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం..ని ఆధారం చేసుకుని గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మలయాళ హీరో దేవ్ మోహన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఫిబ్రవరి 17న ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. అనన్య నాగళ్ళ, గౌత‌మి, సుబ్బరాజుతో వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల రిలీజ్ అయిన ‘శాకుంతలం’ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమా అసలు కథ ఏంటి? అన్నది చర్చనీయాంశం అయ్యింది. ఈ కథ ఏంటంటే.. విశ్వామిత్రుడు ఓ యాగం చేస్తుంటాడు. దానిని చెడగొట్టేందుకు స్వర్గలోకం నుండి భువికి మేనక వస్తుంది.

దీంతో వీరిద్దరికీ ఓ కూతురు జన్మిస్తుంది. కానీ తర్వాత మేనక స్వర్గలోకానికి వెళ్లిపోతుంది. విశ్వామిత్రుడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీరిద్దరి పుట్టిన శకుంతల కన్వ మహర్షి మాత్రం అనాధ అవుతుంది.. తర్వాత ఓ ఆశ్రమంలో పెరుగుతుంటుంది. కొన్నాళ్ళకు హస్తినాపుర రాజైన దుష్యంతుడు వేటకని వచ్చి ఆ ఆశ్రమాన్ని దర్శిస్తాడు. అక్కడ శకుంతలని చూసి ఇష్టపడతాడు. కన్వ మహర్షి యాత్రలో ఉండడంతో వీరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. ‘ఈ ఉంగరం మీద అక్షరాలు లెక్కపెట్టేలోపు నేను తిరిగొస్తా’ అని తన ఉంగరాన్ని శకుంతలకి ఇచ్చి రాజు రాజ్యానికి వెళ్లిపోతాడు దుష్యంతుడు.

ఈ క్రమంలో దుష్యంతుడు గురించి ఆలోచిస్తూ పరధ్యాసలో ఉంటుంది శకుంతల.అదే సమయంలో దుర్వాస మహర్షి వస్తాడు. అయితే అతను ఎంత పిలిచినా శకుంతల స్పందించదు. దీంతో దుర్వాస మహర్షి ‘ఎవరి ఊహల్లో నువ్వు తేలుతున్నావో వాళ్ళు నిన్ను మర్చిపోతారు’ అంటూ శకుంతలను శపిస్తాడు. అది కూడా ఆమె వినిపించుకోదు. చెలికత్తెలే బతిమాలుకుంటారు. ఆయన కాస్త కరిగి “ఏదన్నా వస్తువు చూపిస్తే మర్చిపోయిందంతా గుర్తొస్తుంది” అని వెళ్తిపోతాడు. దుష్యంతుడు శకుంతలకి ఎంతకీ ఏ కబురు పంపడు.

విషయం తెలుసుకున్న కన్వ మహర్షి అత్తారింటికి శకుంతలను పంపిస్తాడు.కానీ దుష్యంతుడు ఆమెను నిరాకరిస్తాడు. గుర్తుగా చూపెట్టబోయిన ఉంగరం నీటిలో పడిపోతుంది. దానిని నదిలోని ఓ చేప మింగేస్తుంది. దీంతో అటు తండ్రి దగ్గరికి వెళ్లలేక, ఇటు భర్త ఇంట్లో స్థానం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను తల్లి మేనక ఆదరించి మరో మహర్షి ఆశ్రమంలో ఉంచుతుంది. చేపలు పట్టేవాడికి ఒక చేప పొట్టలో రాజుగారి ఉంగరం దొరికితే, అది చివరికి రాజు గారికి చేరుతుంది.

దాన్ని చూసి చూడగానే అంతా గుర్తొచ్చిన రాజు శకుంతల కోసం వెతుకులాడటం మొదలెడతాడు. శాకుంతలకి- దుష్యంతుడికి పుట్టిన కుమారుడే భరతుడు అవుతాడు. చివరిగా దుష్యంతుడు శకుంతలను, భరతుడిని కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. దీనినే వెండితెర పై ఆవిష్కరిస్తున్నాడు గుణశేఖర్. ఇందులో ఎమోషనల్ కనెక్టివిటీ చాలా ఉంటుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus