ఆ ఇద్దరూ అదరగొట్టడంతో సంతోషంలో అక్కినేని కుటుంబం!

  • August 4, 2018 / 05:01 AM IST

గూఢచారి.. చిలసౌ.. ఈ రెండూ రిలీజ్ అయ్యాయి. ఇదొక్కటే కామన్ పాయింట్ కాదు. ఈ రెండింటితో అక్కినేని కుటుంబానికి సంబంధం ఉంది. క్షణం సినిమా తర్వాత  అడవి శేష్ నటించిన మూవీ గూఢచారి. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించిన ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సమంత సోదరి అయిన సుప్రియ కూడా నటించిందని అందరికీ తెలుసు. కానీ అదరగొట్టిందని ఈరోజే తెలిసింది. రా ఆఫీసర్ నదియా ఖురేషి పాత్రలో సుప్రియ కనబరిచిన నటన అందరితో అభినందనలు అందుకుంటోంది.

ఎప్పటి నుంచో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో “చిలసౌ” సినిమా చేశారు. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈరోజే విడుదలయి మంచి స్పందన అందుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి  సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని సామాన్యుల నుంచి సినీ విశ్లేషకుల వరకు ప్రశంసిస్తున్నారు. అక్కినేని నాగార్జున మేనల్లుడు, మేన కోడలు ఒకేసారి హిట్ ట్రాక్ లోకి రావడంతో కుటుంబ సభ్యులు మొత్తం సంతోషంలో ఉన్నారు. ఈరోజు రాత్రికి కలిసి వేడుక చేసుకోబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus