క్లోజ్‌ అయిపోయిన కేసును ఓపెన్‌ చేశారా?

  • February 7, 2021 / 11:18 AM IST

ఒక్కో భాషలో ఒక్కోసారి వచ్చినా… అదరగొట్టిన సినిమా ‘దృశ్యం’. మలయాళం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో… హీరోలు, హీరోయిన్లు, యాక్టర్లు మారినా.. ఎక్కడా ఫలితం మాత్రం మారలేదు. ప్రతి దగ్గర ప్రేక్షకులు ఒకేరకమైన అనుభూతికి లోనయ్యారు. అదే ఉత్కంఠ. తర్వాతేం జరుగుతుంది అనే పాయింట్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సినిమా చూస్తున్నవారిని మునివేళ్లపై నిలబెట్టిన చిత్రం అంటారు కదా… అది ఇదే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రెడీ అయ్యింది. అయితే ఈసారి వెండితెరపై కాదు… ఓటీటీ తెరపై అలరించబోతోంది. ఇటీవల సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. మరి ట్రైలర్‌ సంగతేంటో చూద్దామా?

మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో ‘దృశ్యం 2’ సిద్ధమైంది. తొలి సినిమా తీసిన జీతూ జోసెఫ్‌ ఈ సినిమానూ తెరకెక్కించారు. జార్జ్‌ కుట్టి (మోహన్‌లాల్‌) ఊరుకు కొత్త ఎస్సై వస్తాడు. వచ్చీ రాగానే మోహన్‌లాల్‌ మీద ఉన్న పాత కేసును బయటకు తీస్తాడు. అసలు కేసు ఎందుకు మళ్లీ తవ్వుతున్నారు. దాని వెనుక ఏదైనా కారణం ఉందా? అసలు మోహన్‌లాల్‌ ఫ్యామిలీ గురించి ఊళ్లో వాళ్లు ఏమనుకుంటున్నారు. అతను నిరపరాధి అని అందరూ అనుకుంటున్నారా? కుటుంబ సభ్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ట్రైలర్‌లో చూపించారు.

తొలి సినిమా ఎంత గ్రిప్పింగ్‌గా అనిపించిందో, రెండో భాగమూ అలానే ఉంది. ట్రైలర్‌ కట్‌ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ‘దృశ్యం’ చూసినవారు ఈ ట్రైలర్‌ చూడగానే ఠక్కున కనెక్ట్‌ అయిపోతారు. భాషతో అస్సలు పని ఉండదు. ఆ సినిమా చూడనివారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరి జార్జ్‌ కుట్టి ఆ కేసు నుంచి విజయవంతంగా తప్పించకున్నాడా లేదా అనేది మరో 10 రోజుల తర్వాత తెలిసిపోతుంది. ఎందుకంటే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus